News March 26, 2024
రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారు: బత్యాల

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కిల్లీ కొట్టులో కూడా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విక్రయించే నాసిరకం మద్యం తాగడంతో పలువురు పేదలు కూడా మరణించారని విమర్శించారు.
Similar News
News December 11, 2025
కడప కలెక్టర్కు 16వ ర్యాంకు

కడప కలెక్టర్గా శ్రీధర్ చెరుకూరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 481 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 466 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను కేవలం 2 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 16వ ర్యాంకు కేటాయించారు.
News December 11, 2025
యురేనియం బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

తుమ్మలపల్లి యురేనియం గ్రామాల సమస్యలపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం సమీక్షించారు. కేకే కొట్టాల భూసేకరణకు ల్యాండ్ కమిటీ వేసి నోటిఫికేషన్ ఇస్తామని, ఇందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. పెండింగ్ ఉద్యోగాలు, పరిహారం వెంటనే క్లియర్ చేయాలని UCIL అధికారులను ఆదేశించారు. బాధితులకు సీఎస్ఆర్ ద్వారా వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


