News October 28, 2024
రాష్ట్రాన్ని ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు: కాకాణి

రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని రామాయపట్నం, మచిలీపట్నం పోర్టును కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిధులు లేవని సాకు చెబుతూ సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.
Similar News
News November 24, 2025
VPR దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన్ను జిల్లా పరిషత్కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వీపీఆర్ నివాసానికి వచ్చిన ఆయన వేమిరెడ్డి దంపతులను కలిసి బొకే అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వేమిరెడ్డి సూచించారు.
News November 24, 2025
కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
News November 24, 2025
కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.


