News April 2, 2025
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచిర్యాల బిడ్డ చంద్రమోహన్

తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన ఊదారీ చంద్రమోహన్ గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం HYDలో జరిగిన ఎన్నికల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా 20/20 ఓట్ల మెజార్టీతో చంద్రమోహన్ గెలుపొందారు. సెక్రటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి బాస్కెట్ బాల్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


