News April 25, 2024
రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా జై కాంత్

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ల బృందంలో జిల్లాకు చెందిన ఎస్.జై కాంత్ను నియమించినట్లు YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొంది. క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాలు ఎలక్షన్ నిబంధనలో వ్యవహరించాల్సిన తీరును కోఆర్డినేటర్లు పరీక్షిస్తారని తెలిపింది. ఈ బృందంలో ఐదుగురు రాష్ట్రస్థాయి సభ్యులు ఉన్నారు.
Similar News
News April 23, 2025
10th Results: 25వ స్థానంలో కర్నూలు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 16,326 మంది బాలురులో 9,854 మంది, 14,859 మంది బాలికలు పరీక్ష రాయగా 10,730 మంది పాసయ్యారు. 66.01 పాస్ పర్సంటైజ్తో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.