News September 19, 2024
రాష్ట్ర గవర్నర్ను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ డా.గోపాల్ బుధవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని గవర్నర్కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ డా.శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News December 8, 2025
భీమవరం: రక్తదాన వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప.గో.జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
News December 8, 2025
ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.


