News March 18, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

image

ఉమ్మడి కరీంనగర్,​ మెదక్,​ నిజామాబాద్,​ ఆదిలాబాద్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.

News November 1, 2025

జగిత్యాల: ‘ఎవరైన చావాలా సార్..?’

image

మల్యాలలో <<18168200>>నేడు రోడ్డుప్రమాదం<<>> జరిగిన సంగతి తెలిసిందే. కాగా రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై OCT 17న ‘రోడ్డును కమ్మేసిన పిచ్చిమొక్కలు’ శీర్షికన Way2Newsలో వార్త ప్రచురితమైంది. అయినా అధికారులు మాకేం పట్టింపన్నట్లుగా ఉండటంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ‘ఎవరైన చావాలా’ అని అడుగుతున్నారు.

News November 1, 2025

HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.