News February 27, 2025

రాష్ట్ర పోలీస్ కబడ్డి మహిళ జట్టులో జిల్లా వాసికి చోటు

image

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన గోదావరి రాష్ట్ర పోలీసు కబడ్డి ఉమెన్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నిజామాబాద్ పోలీసు డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపికవడంపై కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 27, 2025

ధర్పల్లి: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

ధర్పల్లి మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. SI రామకృష్ణ వివరాలిలా.. ధర్పల్లిలోని చెరువులో గురువారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు 35- 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా గుర్తించామని, ఎవరైనా శవాన్ని గుర్తుపడితే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని SI వెల్లడించారు.

News February 27, 2025

NZB: 17న మిస్సింగ్ 26న మృతదేహం లభ్యం

image

ఈ నెల 17 నుంచి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు NZB 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాలు.. NZB కోటగల్లీకి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(48) ఈ నెల డ్రైవింగ్‌పై కుంభమేళాకు వెళ్లి 17న తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన మృతదేహం నవీపేట్ గాంధీనగర్ శివారులో లభ్యమైనట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News February 27, 2025

భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తన తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.

error: Content is protected !!