News February 18, 2025
రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ జాతర వాల్ పోస్టర్ల ప్రదర్శన

వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల వద్ద వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది అతికిస్తున్నారు. ఈనెల 25 నుంచి 27 గురువారం వరకు మూడు రోజులపాటు వేములవాడలో మహా శివరాత్రి జాతర జరుగుతుందన్నారు. పూజల వివరాలు, సమయాలతో కూడిన పూర్తి వివరాలతో వాల్ పోస్టర్లను రూపొందించామని తెలిపారు.
Similar News
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
GOOD NEWS.. మేడ్చల్లో సదరం క్యాంపులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏరియా ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్లు అందించడం కోసం దివ్యాంగులకు సదరం క్యాంప్ షురూ అయింది. DEC 16, 22న చెవిటితనం, వినికిడి లోపం ఉన్నవారికి, ఈనెల 4, 11, 18వ తేదీల్లో అంగవైకల్యం ఉన్నవారికి, 9న కంటిచూపు, 13, 21న మానసిక వికలాంగులకు స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంది. మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టంచేశారు.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.


