News April 12, 2025
రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట విద్యార్థిని సత్తా.. సన్మానం

మాచిరాజు బాల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 2025 బాలల కథల పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థిని స్తతా చాటింది. ఈ పోటీల్లో బక్రీ చెప్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జక్కుల లోహితకు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం బక్రీ చెప్యాల పాఠశాలలో లోహితను ఉపాధ్యాయులు సన్మానించారు. 541 కథలను వెనక్కు నెట్టి లోహిత కథ మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News October 18, 2025
కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.
News October 18, 2025
అచ్చంపేట: చెంచులకు సామూహిక వివాహాలు

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న చంద్రారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో చెంచులకు సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కార్టులు వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు.
News October 18, 2025
వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.