News April 12, 2025
రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట విద్యార్థిని సత్తా.. సన్మానం

మాచిరాజు బాల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 2025 బాలల కథల పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థిని స్తతా చాటింది. ఈ పోటీల్లో బక్రీ చెప్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జక్కుల లోహితకు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం బక్రీ చెప్యాల పాఠశాలలో లోహితను ఉపాధ్యాయులు సన్మానించారు. 541 కథలను వెనక్కు నెట్టి లోహిత కథ మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News April 17, 2026
సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

టాలీవుడ్లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.
News April 17, 2026
విజయవాడ: ఆన్లైన్ బెట్టింగ్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

విజయవాడలో ‘లెమన్ ఎక్స్చేంజ్’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బుకీ చాంద్ బాషా, సబ్ బుకీ పోతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.
News April 17, 2026
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.8,939

ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939 పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలు రూ.6,076 ధరలు లభించాయి. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవని వారు మండిపడుతున్నారు.


