News January 30, 2025

రాష్ట్ర స్థాయిలో హనుమకొండ బిడ్డ సత్తా చాటాడు

image

ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో హనుమకొండ నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొప్పుల చరణ్ వరంగల్ జిల్లా తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఈ పోటీల్లో వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఇన్‌ఛార్జ్ కె.విద్యాకర్ అభినందించి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. 

Similar News

News October 17, 2025

అప్పే దొంగగా మార్చింది.. చోరీకి పాల్పడి కటకటాల్లోకి

image

నల్గొండ: పెరిగిన అప్పులు ఒక వ్యక్తిని దొంగగా మార్చాయి. బంగారు గొలుసు చోరీకి పాల్పడి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. NLG పద్మానగర్‌కు చెందిన నాగుల శ్రీనివాస్‌ ఇద్దరు కుమార్తెల పెళ్లి కోసం అప్పు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో బుధవారం శాలిగౌరారం మండలం మాదారంకలాన్ శివారులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

News October 17, 2025

NLG: ఆ 7 దుకాణాలకు బోణీ కాలేదు!

image

జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో 7 మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తులు బోణీ కాలేదు. ఇందులో దేవరకొండలో 70, చండూరులో 106, 108వ నెంబర్, ఓపెన్ కేటగిరి షాపులు, హాలియాలోని 128, 129 , 130 ఎస్సీ రిజర్వు, నాంపల్లిలోని 14వ నెంబరు ఎస్సీ రిజర్వ్ షాపులు ఉన్నాయి. గతంలో 757 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు అందులో సగం కూడా దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.

News October 17, 2025

నేటి నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. 88 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం అందించనుంది. 32 జిల్లాల్లోని 46వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు రూ.123 కోట్లు ఖర్చు చేస్తోంది. మక్తల్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.