News August 5, 2024

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు హవా

image

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా విజయనగరం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 

Similar News

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

image

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.