News February 18, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో జగిత్యాల బిడ్డల ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వెళ్లిన ఆరుగురు విద్యార్థులు 12 బంగారు పతకాలతో మెరిశారు. పట్టణంలోని వీర కుంగ్ ఫూ అకాడమీలో శిక్షణ పొందిన ఆరుగురు విద్యార్థులు మానూప్, కనిక్, మన్విత, మణిదీప్, అన్వితలు పాల్గొని 12 బంగారు పతకాలు సాధించారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
జిల్లావ్యాప్తంగా 620 వార్డులు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు వెల్లడించారు.


