News February 18, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో జగిత్యాల బిడ్డల ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వెళ్లిన ఆరుగురు విద్యార్థులు 12 బంగారు పతకాలతో మెరిశారు. పట్టణంలోని వీర కుంగ్ ఫూ అకాడమీలో శిక్షణ పొందిన ఆరుగురు విద్యార్థులు మానూప్, కనిక్, మన్విత, మణిదీప్, అన్వితలు పాల్గొని 12 బంగారు పతకాలు సాధించారు.
Similar News
News November 21, 2025
లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.
News November 21, 2025
లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-2

పెట్టుబడిదారులు తొలుత బంగారాన్ని లీజింగ్ ప్లాట్ఫామ్ లేదా ఆర్థిక సంస్థకు ఇస్తారు. ఆ సంస్థ నుంచి గోల్డ్ను జువెలర్లు తీసుకుని ఆభరణాలు తయారు చేసి అమ్ముకుంటారు. ఇన్వెస్టర్లకు లీజ్ రేట్ ప్రకారం డబ్బు చెల్లిస్తారు. గడువు పూర్తయ్యాక బంగారాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి ఇస్తారు. లేదా లీజ్ రెన్యూవల్ చేసుకుంటారు. అయితే జువెలర్లు దివాళా తీస్తే గోల్డ్ రికవరీ కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 21, 2025
నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు

నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సోయాబీన్ సేకరణ చేపట్టనున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాల్ లకు పరిమితిని పెంచిందని వెల్లడించారు. కావున రైతులు గమనించి సోయాబీన్ ను 12% తేమ ఉండేటట్లు ఎండబెట్టి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 పొందవచ్చని సూచించారు.


