News February 18, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో జగిత్యాల బిడ్డల ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వెళ్లిన ఆరుగురు విద్యార్థులు 12 బంగారు పతకాలతో మెరిశారు. పట్టణంలోని వీర కుంగ్ ఫూ అకాడమీలో శిక్షణ పొందిన ఆరుగురు విద్యార్థులు మానూప్, కనిక్, మన్విత, మణిదీప్, అన్వితలు పాల్గొని 12 బంగారు పతకాలు సాధించారు.
Similar News
News October 21, 2025
నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.
News October 21, 2025
వరంగల్: కాంగ్రెస్లో గులాబీ ముళ్లు

WGL ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తాయి. ఇప్పుడు మళ్లీ కొండా వివాదంలో అదే నడుస్తోంది. మేడారం టెండర్ల వివాదం నుంచి ఓఎస్డీ సరెండర్ వరకూ కొండా చుట్టూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై నేతల మాటలకు మూతపడ్డాయి. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీసీ మహిళ మంత్రిని తొలగించేందుకు కడియం ప్రయత్నిస్తున్నాడని చెప్పడం దుమారం రేపింది.
News October 21, 2025
కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

బిహార్లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.