News August 20, 2024

రికార్డు సృష్టించిన కరీంనగర్ ఆర్టీసీ రీజియన్

image

కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రీజియన్‌లో 5.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 4.40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పగా 107 ఓఆర్ వచ్చింది. మూడు రోజుల్లో 450 అదనపు ట్రిప్పుల బస్సులను నడిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలిచింది.

Similar News

News December 17, 2025

ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

image

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్‌గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్‌గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.

News December 17, 2025

మూడోదశ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల్లోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, CCటీవీ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.

News December 16, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు అవకాశం.. 19న జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఆటోమోటివ్స్ KNR సంస్థలోని 20 పోస్టులకు గాను, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 20-40 ఏళ్ల పురుషులు అర్హులు. వేతనం రూ.14,000 నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 72076 59969 నంబర్లను సంప్రదించవచ్చు.