News January 28, 2025

రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును విరమించుకోవాలి: నాగరాజు

image

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును విరమించుకోవాలని రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. సంపదను సృష్టిస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆస్తులకు కన్నం వేస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 9, 2025

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

image

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పంచాగం మోహన్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి మాల ధరించిన భక్తులు గ్రామంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, భజన చేసుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి రాజ, వెంకటరెడ్డి, బెస్త నాగరాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

News February 8, 2025

మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

image

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.

News February 8, 2025

శైలజానాథ్‌కు కీలక పదవి ఇస్తారా?

image

పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్‌కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

error: Content is protected !!