News February 13, 2025

రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ROలు నోటిఫికేషన్ జారీ చేసిన రోజే నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News December 9, 2025

NGKL: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

image

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ఇన్చార్జి ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.

News December 9, 2025

కామారెడ్డి: మరికాసేపట్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర

image

కామారెడ్డి జిల్లాలోని మొదటి విడత ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. కామారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, భిక్నూర్, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, పలు పార్టీల మద్దతుదారులు, నవతరం యువత వినూత్న పద్ధతుల్లో, విస్తృతంగా ప్రచారం చేశారు. సాయంత్రం 6గం.లకు ప్రచారానికి ఇక తెర పడనుంది.

News December 9, 2025

అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చిలా: కలెక్టర్

image

1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఆవరణలో ఆయన అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా వ్యవహరించాలన్నారు.