News April 3, 2025

రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి: జేసీ 

image

అనకాపల్లి జిల్లాలో చేపడుతున్న రెండవ విడత రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె బుధవారం మాట్లాడుతూ.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముందుగా భూ యజమానులకు నోటీసులు అందజేయాలని తెలిపారు. సర్వేకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుందన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Similar News

News February 28, 2026

వరంగల్‌: నేడే రాకెట్ ప్రయోగం ఎందుకో తెలుసా..?

image

వరంగల్ భద్రకాళి బండ్‌పై శనివారం మోడల్ రాకెట్ ప్రయోగం చేపట్టనున్న విషయం తెలిసిందే. సాయంత్రం ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఖగోళ ఘటనల్లో ఒకటైన ప్లానెట్ పరేడ్ శనివారం జరగనుంది. బృహస్పతితో పాటు శుక్రుడు, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుతం ఆకాశంలో కనిపించనుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు కూలంకషంగా వివరించనున్నారు.

News February 28, 2026

అతిసారం అదుపులోనే ఉంది: శ్రీకాకుళం కలెక్టర్

image

అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది చికిత్స పొందుతున్నారు.

News February 28, 2026

మెదక్: ముగ్గురు మహిళ BOSSలు!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.