News February 16, 2025
రీ సర్వే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

గోనెగండ్లలో జరుగుతున్న రీసర్వే పనులనుకలెక్టర్ రంజిత్ భాష శనివారం పరిశీలించారు. అధికారులు చేపడుతున్న రీసర్వే విధానాన్ని, తహశీల్దార్ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా రీసర్వే కొనసాగించాలన్నారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 22, 2025
కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.
News December 22, 2025
ఫిర్యాదులపై చట్టపర చర్యలు: కర్నలు SP

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మోసాలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, దాడులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.
News December 22, 2025
కర్నూలు: విద్యుత్ సమస్యల పరిష్కారంపై అవగాహణ

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు APSPDCL ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ SE ప్రదీప్ కుమార్ ఉన్నారు.


