News April 14, 2025

రుణాల కోసం దరఖాస్తు చూసుకోండి: దుర్గాబాయి

image

పల్నాడు జిల్లాలోని SCలకు SC కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక మద్దతు పథకాల కోసం మే 10లోగా ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కార్పొరేషన్ AD దుర్గాబాయి తెలిపారు. జిల్లాలోని 922 మంది లబ్ధిదారులకు రూ. 38.58కోట్లు సబ్సిడీ, బ్యాంక్ లోన్‌ల కింద రుణం మంజూరు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించబడిందన్నారు. 21 నుంచి 50 ఏళ్ల లోపు వారు అర్హులని, https://apobmms.apcfss. నమోదు చేసుకోవాలని కోరారు. 

Similar News

News December 5, 2025

భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

image

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 5, 2025

KNR: భారీ ఆదాయం.. అయినా సొంత భవనాల్లేవ్..!

image

అద్దె భవనాలు, అరకొర వసతులతో రవాణా శాఖ అవస్థలు పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. అయినా KNR DTO ఆఫీస్ మినహా SRCL, PDPL, JGTL, కోరుట్ల, రామగుండం, HZB కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీంతో ట్రాకులు లేక గుంతల రోడ్లపైనే డ్రైవింగ్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి సరైన వసతులు కల్పించాలి.

News December 5, 2025

ఆదిలాబాద్: ‘కాంప్రమైజ్’ రాజకీయాలు

image

ఉమ్మడి జిల్లాలో ‘కాంప్రమైజ్’ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకే కులం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన పక్షంలో ఒక్కరినే బరిలో ఉంచేందుకు కుల సంఘాల పెద్దలు, వీడీసీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఒకచోట చేర్చి మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు.