News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు <<16016221>>ఫుడ్<<>> పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి తల్లి పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిని వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 31, 2025

రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

image

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

News October 31, 2025

సిరిసిల్ల: మిగిలి ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్

image

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతుల నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ తెరిసా తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 4న ఉదయం 11 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాజరుకావాలని ఆమె కోరారు.

News October 31, 2025

ఆ మందు లేదన్నందుకు వైన్‌షాప్‌ క్యాషియర్‌పై దాడి

image

ఖమ్మం: ఆ మద్యం బ్రాండ్(రాయల్ స్ట్రాంగ్) ఇవ్వలేదన్న కోపంతో వైన్ షాప్ క్యాషియర్‌పై యువకులు దాడి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో పనిచేసే పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌పై ఐదుగురు యువకులు తనకు నచ్చిన మధ్యం ఇవ్వాలని అడిగారు. అది లేదనడంతో కోపంతో డాడికి పాల్పడ్డారు. దాడి వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.