News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017723>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 13, 2025

HNK: కేజీబీవీల అభివృద్ధికి నిధుల మంజూరు!

image

జిల్లాలోని 9 కేజీబీవీల్లో పలు అభివృద్ధి పనులకు నిధుల కోసం పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ధర్మసాగర్, శాయంపేట, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్ కేజీబీవీలకు ఒక్కో దానికి రూ.38.152 లక్షలు, ఐనవోలు కేజీబీవీకి 130.52 లక్షలు, భీమదేవరపల్లి కేజీబీవీకి 101.052 లక్షలు, వేలేరు కేజీబీవీకి 128.650 లక్షలు, ఆత్మకూరు కేజీబీవీకి 143.954 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కేజీబీవీల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

News November 13, 2025

MBNR: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఫీజు చెల్లింపులకు నేడే తుది గడువు

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో 2019-2024 మధ్య చేరిన డిగ్రీ 1వ, 3వ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించడానికి నవంబర్ 13 తుది గడువు అని పాలమూరు ఓపెన్ వర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే, 2022-2024 మధ్య MA, MCom, MSc కోర్సుల్లో చేరిన 2వ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని వివరించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News November 13, 2025

చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

చింతపల్లిలో గురువారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం 17 డిగ్రీలు నమోదు కాగా.. గురువారం 12 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో, ఉష్ణోగ్రతలు మరింతగా దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలి పులి పంజాకు ప్రజలు గజగజలాడుతున్నారు.