News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017744>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 9, 2025

పోస్టల్ బ్యాలెట్‌ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ సూచించారు. రెండవ విడత మండలాల్లో డిసెంబర్ 7-10, మూడవ విడత మండలాల్లో 10,12,13,15 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

News December 9, 2025

జామపండు తింటే ఎన్నో లాభాలు!

image

మార్కెట్‌లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it

News December 9, 2025

ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

image

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.