News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

 ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది. 

Similar News

News January 10, 2026

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి మరిన్ని చిత్రాలు

image

ఈ ఏడాది ఆస్కార్‌ రేసులో తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ బెస్ట్ పిక్చర్‌ కేటగిరీలో పోటీ పడనుంది. ఇక హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన <<18806607>>కాంతార<<>>: చాప్టర్‌-1, మహావతార్‌ నరసింహ చిత్రాలు జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఇవి ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో సెలక్ట్ అయ్యాయి. అలాగే తన్వీ ది గ్రేట్‌, సిస్టర్‌ మిడ్‌నైట్‌, హోమ్‌బౌండ్ సినిమాలు ఉన్నాయి.

News January 10, 2026

మెదక్: ‘సీఎం కప్ క్రీడలు.. 16 వరకు ఛాన్స్’

image

మెదక్ జిల్లాలో ‘సీఎం కప్’ క్రీడల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేష్ మండల విద్యా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. క్రీడల అవగాహన కోసం ఈనెల 12 వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.

News January 10, 2026

వర్మకు పరాభవం.. కనీసం పేరు ఎత్తని పవన్ కళ్యాణ్!

image

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంక్రాంతి సంబరాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమానికి హాజరైన ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా, పవన్ తన ప్రసంగంలో వర్మ పేరును కనీసం ప్రస్తావించకపోవడం వివాదాస్పదమైంది. హైపర్ ఆదిని ప్రశంసించిన పవన్, తన గెలుపులో కీలకమైన వర్మను విస్మరించడంపై టీడీపీ శ్రేణులు, వర్మ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.