News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

 ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది. 

Similar News

News February 23, 2026

చేవెళ్ల: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..!

image

చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. 2018లో ప్రేమవివాహం చేసుకున్న రాజేశ్వరి, కృష్ణ చంద్రారెడ్డినగర్‌లో ఉంటున్నారు. 6 నెలల క్రితం భార్యకు ఇన్‌స్టాగ్రాంలో శరత్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి రాజేశ్వరి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News February 23, 2026

నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో PGRS

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

News February 23, 2026

తిరుపతి: లడ్డూ వివాదం.. నేడు ఏం జరగనుందో.?

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించగా.. దీనిపై మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఇది వరకే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. మళ్లీ AP ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్ట్‌లో ఏం జరగనుందో అన్న చర్చ నడుస్తోంది.