News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Similar News
News November 28, 2025
HYD: ప్లీజ్.. పిల్లలను టెన్షన్ పెట్టకండి

పేట్ బషీరాబాద్ PS పరిధిలో స్కూల్ ఫీజు చెల్లించలేకపోవడంతో 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తప్పు యాజమాన్యానిదైనా.. తల్లిదండ్రులదైనా ఘోరం జరిగిపోయింది. చదువుకోవాలని ఉన్నా చదువు”కొనలేని” స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులూ ఇప్పటికైనా మారండి మేనేజ్ మెంట్తో మాట్లాడండి. పిల్లలకు సర్దిచెప్పండి. యాజమాన్యాలు కఠిన వైఖరి తగ్గించాలి. లేకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి.
News November 28, 2025
12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT
News November 28, 2025
పరకామణి దోషులకు శిక్ష పడాలి: YV సుబ్బారెడ్డి

పరకామణి అక్రమాలపై పక్కాగా విచారణ జరగాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని TTD మాజీ ఛైర్మెన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో CID విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ‘భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడవద్దు. తిరుమల లడ్డూ, పరకామణి ఘటనలను అడ్డం పెట్టుకొని వివాదాలు రేపుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని మేమే చెబుతున్నాం. నన్ను పిలిచినా, భూమనను పిలిచినా విచారణ కోసమే’ అని YV అన్నారు.


