News June 16, 2024

రుషికొండపై పచ్చని రిసార్ట్స్ తొలగించి విలాస భవనం కట్టారు: గంటా

image

ప్రకృతి అందానికి నిలయమైన రుషికొండపై చెట్లను తొలగించడంతో పాటు రిసార్ట్స్ నేలమట్టం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఎంతో ముచ్చటగా కట్టుకున్న ఈ భవనంలోకి రాకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

Similar News

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

విశాఖ: సంక్రాంతి వేళ రైతు బజార్లకు సెలవు రద్దు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతు బజార్లకు ఉండే వారాంతపు సెలవులను రద్దు చేస్తున్నట్లు DD శ్రీనివాస్ కిరణ్ తెలిపారు. ఈ మంగళవారం, బుధవారం కూడా రైతు బజార్లు యథావిధిగా తెరిచే ఉంటాయని వెల్లడించారు. పండుగకు అవసరమైన కూరగాయలు, సరుకుల కొనుగోలు కోసం ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 10, 2026

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.