News June 17, 2024

రుషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు: అమర్నాథ్

image

జగన్ ప్రభుత్వం రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకుల ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు.

Similar News

News December 9, 2025

విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

image

భద్రతా పనుల కారణంగా కేకే లైన్‌లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.

News December 9, 2025

విద్యార్థుల్లో నైపుణ్యాల కోసమే బాలోత్సవాలు: విశాఖ DEO

image

విశాఖ బాలోత్సవం సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి ఎన్.ప్రేమ్ కుమార్ దీనిని ప్రారంభించగా.. రోటరీ గవర్నర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. మొదటి రోజు వివిధ విభాగాల్లో 27 అంశాలపై పోటీలు నిర్వహించారు.

News December 9, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘Gen-Z’ పోస్టాఫీసు ప్రారంభం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలోనే తొలి ‘Gen-Z’ థీమ్డ్ పోస్టాఫీసును వీసీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్, పోస్ట్ మాస్టర్ జనరల్ జయశంకర్ మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులు, పరిశోధకుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ కౌంటర్లు, వేగవంతమైన పార్శిల్ సేవలతో ఈ ఆధునిక పోస్టాఫీసును తీర్చిదిద్దారు. ఇది విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి, ప్రాజెక్టుల పనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీసీ పేర్కొన్నారు.