News February 24, 2025

రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

Similar News

News November 28, 2025

మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

image

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్‌కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.

News November 28, 2025

త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

image

ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. SHARE IT