News February 24, 2025

రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

Similar News

News February 25, 2025

NZB: మద్యం ప్రియులకు షాక్..  

image

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ నిర్వహించాలని ఎక్సైజ్ సీఐ దిలీప్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను మద్యం వ్యాపారులు తప్పనిసరిగా అమలు పరచాలని సూచించారు.

News February 25, 2025

భద్రాచలం: MURDER అటెంప్ట్.. జైలు శిక్ష

image

హత్యాయత్నం కేసులో నిందితుడికి భద్రాచలం కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్‌ కాలనీకి చెందిన వినోద్‌, దుమ్ముగూడెంకు చెందిన జెట్టి చరణ్‌ పై ఫిర్యాదు చేయగా భద్రాచలం టౌన్ ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జిషీట్ వేసి విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన న్యాయమూర్తి శివనాయక్‌ సోమవారం తీర్పును వెల్లడించారు.

News February 25, 2025

ఇంటర్ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!