News May 4, 2024
రూ: 2లక్షల 53 వేల విలువగల గంజాయి స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దీని విలువ రూ: 2లక్షల 53 వేలు ఉంటుందని పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై లాల్ సింగ్ నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News November 1, 2025
ADB: జాతీయ గౌరవ దివాస్లో పాల్గొన్న ఎంపీ నగేశ్

హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు బీర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు.
News November 1, 2025
ADB: మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన MP నగేశ్

మాజీ మంత్రి, MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శనివారం హరీష్ రావు నివాసంలో శనివారం పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
News November 1, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.


