News December 7, 2024

‘రూ.200 కోట్లు విలువైన భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారు’

image

రూ.200కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని మదనపల్లెకు చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాల్ నాయుడు దంపతులు ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన కట్టా సులోచనను పెద్దిరెడ్డి బినామీగా పెట్టి మదనపల్లెకు చెందిన 15 కుటుంబాలకు చెందిన భూమికి కబ్జా చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Similar News

News March 1, 2026

చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.

News March 1, 2026

చిత్తూరు: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.

News February 28, 2026

పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

image

గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం 197. రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 89.76% పెన్షన్లు పూర్తి చేశామన్నారు. మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. పెన్షన్ లబ్ధిదారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.