News October 16, 2024
రూ. 2000 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గోషామహల్లో దాదాపు 32 ఎకరాల్లో రూ. 2000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే పేషెంట్ల సమస్యలు తీరుతాయని శుభవార్త చెప్పారు.
Similar News
News February 24, 2026
HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
News February 23, 2026
గ్రేటర్లో కొత్త వెలుగుల జిలుగులు

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.
News February 23, 2026
మురికి కూపంలో జవహర్నగర్.. డంపింగ్ యార్డు వేట!

గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.


