News January 1, 2026

రూ. 210 కోట్లతో SC, ST కాలనీల అభివృద్ధి : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో SC, ST కాలనీల అభివృద్ధికి రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 31/12/2025 నాటికి రూ. 120 కోట్లతో SC,ST కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా SC లు 4 లక్షలు, ST లు 65 వేలు ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News April 19, 2026

చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

image

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.