News April 2, 2025

రూ.266 కోట్లతో అభివృద్ధి పనులు: అన్నమయ్య కలెక్టర్

image

ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల లక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. 2025-26 మొదటి త్రైమాసికానికి రూ.266కోట్ల లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. రూ.43కోట్ల అంచనాతో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం, రూ.100 కోట్లతో సీసీ రోడ్లు, మినీ గోకులాల నిర్మిస్తామన్నారు.

Similar News

News November 24, 2025

హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

image

‘షోలే’ మూవీ షూటింగ్‌లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.

News November 24, 2025

జగిత్యాల: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్: సంజయ్

image

కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు దోచుకుంటే.. తర్వాత కాంగ్రెస్ దోచుకుంటుందని పేర్కొన్నారు. రెండేళ్లు పాలనలో ఉండి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా మోసగిస్తుందని అన్నారు.

News November 24, 2025

సిరిసిల్ల: కార్మికులకు అవగాహన సదస్సు

image

ఈనెల 24 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.