News January 29, 2025
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహశీల్దార్ జాహ్నవి బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతుకు పాస్ బుక్ ఇచ్చేందుకు తహశీల్దార్ జాహ్నవి, VROతో కలిసి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా ఆమె రెడ్హ్యాండెడ్గా చిక్కినట్లు సమాచారం.
Similar News
News November 6, 2025
గోదావరిఖని: ‘గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలి’

సింగరేణి గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలని సీఐటీయూ-ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడారు. గతంలో లాభాల విషయంలో సీఎంతో కలిసి చెక్కులు ఇచ్చి, బయటకు వచ్చి ఖండిస్తున్నామన్నారని తెలిపారు. ఇప్పుడు 100 నుంచి 150 మస్టర్లకు పెంచిన అంశాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటనలు చేసి, కార్మికుల వ్యతిరేకతతో ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.
News November 6, 2025
భామిని: ‘విద్యార్థులు క్రీడల్లో రాణించాలి’

జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలను ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథం గురువారం సీతంపేటలో ప్రారంభించారు. పీవో క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రానించాలని సూచించారు. క్రీడలతో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, స్పోర్ట్స్ ఇన్ఛార్జి జోకబ్, సూపరింటిండెంట్ అప్పారావు ఉన్నారు.
News November 6, 2025
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధంకండి: కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ సూచనలు చేశారు. సన్నద్ధతలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని ముఖ్య దశలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు.


