News July 11, 2024

రూ.4.04 కోట్లతో నెల్లూరు రోడ్లు బాగయ్యేనా?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పలు మార్గాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు పరిధిలో 60 KM రాష్ట్ర రోడ్ల బాగుకు రూ.1.14 కోట్లు, 220 KM జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.2.90 కోట్లు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.4.04 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Similar News

News October 18, 2025

రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

image

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.

News October 18, 2025

పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

image

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్‌గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.

News October 17, 2025

నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

image

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.