News July 11, 2024

రూ.4.04 కోట్లతో నెల్లూరు రోడ్లు బాగయ్యేనా?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పలు మార్గాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు పరిధిలో 60 KM రాష్ట్ర రోడ్ల బాగుకు రూ.1.14 కోట్లు, 220 KM జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.2.90 కోట్లు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.4.04 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Similar News

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

image

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

image

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 19, 2025

నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

image

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.