News April 19, 2024

రూ.4.2 కోట్ల విలువైన నగదు, లిక్కర్ సీజ్: కలెక్టర్

image

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 16 నుంచి నేటి వరకు 92 లక్షల నగదు, 42 లక్షల విలువైన లిక్కర్, 29 లక్షల విలువైన డ్రగ్స్, 1 కోటి 81 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు 74 లక్షల విలువైన ఇతర సామాగ్రిని కలిపి 4.2 కోట్లను సీజ్ చేశామన్నారు. ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా వ్యయ కమిటి , సి విజిల్ , మీడియా మానటరింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 30, 2024

బొబ్బిలిలో సినీ నటుడు సాయికుమార్

image

బొబ్బిలిలోని స్థానిక హోటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో సాయికుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే తమ బంగారు భవిష్యత్ శూన్యమవుతుందని సూచించారు.

News September 30, 2024

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మన విజయనగరంలో..

image

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరంలో ఏర్పాటు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన 12వేల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య లక్ష వరకు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కేంద్రం రామాయణంపై పరిశోధనలకు, మానవత్వ విలువలను భావితరాలకు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.

News September 30, 2024

కురుపాంలో రోడ్డు ప్రమాద ఘటనలో UPDATE

image

కురుపాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీలకంఠరావు వివరాలు.. దొంబిడిలోని పాస్టర్ దుర్గారావు, భార్యతో కలిసి బైకుపై ప్రార్థనకు వెళ్తున్నారు. బి.శ్రీను, అతని స్నేహితుడికి ప్రకృతి అందాలు చూపించేందు బైకుపై వచ్చాడు. వారి ఇరువురి బైకులు ఎదురుగా వచ్చి బల్లేరుగూడ వద్ద ఢీకొన్నాయి. ఘటనలో శ్రీను, దుర్గారావు మృతి చెందారు.ఘటనపై SI కేసు నమోదు చేశామన్నారు.