News March 1, 2025
రూ.45లక్షలతో జీజీహెచ్లో మౌలిక వసతులు – కలెక్టర్

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీజీహెచ్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.
Similar News
News July 11, 2025
కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.
News July 11, 2025
కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్ను మన మిత్ర వాట్సాప్ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్ గ్రీవెన్స్ మాడ్యూల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.
News July 10, 2025
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ విజయవాడ అమ్మాయికి కాంస్య పతకం
☞కృష్ణా జిల్లా వ్యాప్తంగా పీటీఎం
☞ పామర్రు – భీమవరం హైవే( వీడియో)
☞ గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్ కళ్యాణ్కు వినతి
☞ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా భారత్: గవర్నర్
☞ మచిలీపట్నంలో 11న జర్నలిస్టులకు వర్క్ షాప్
☞ పెనమలూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల
☞ విజయవాడ: నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు