News February 28, 2025

రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి: హోం మంత్రి 

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో హోంశాఖకు రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి అని హోమ్ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ‘ఎక్స్’ వేదిగా హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖకు రూ.920 కోట్ల పెండింగ్ బకాయిల్లో ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లించామన్నారు. 

Similar News

News October 15, 2025

KNR: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

image

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

News October 15, 2025

ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News October 15, 2025

సిరిసిల్ల: జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలు

image

జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలు, హైస్కూలలో ఈ జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.