News April 25, 2024

రూ.9.64 కోట్ల బంగారు ఆభరణాలు స్వాధీనం

image

చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద చిల్లకూరు పోలీసులు మంగళవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో రూ.9.64 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా నెల్లూరు నుంచి తిరుపతి, మదనపల్లె, చిత్తూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆభరణాలను సీజ్ చేసినట్లు గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News January 13, 2025

మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 13, 2025

నెల్లూరు: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 13, 2025

నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా వాసుల సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.