News April 26, 2024

రూ.9500 పలికిన నిమ్మకాయల బస్తా

image

పొదలకూరు మార్కెట్లో శుక్రవారం నాణ్యమైన నిమ్మకాయలు బస్తా రూ.9.500 పలికాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు బస్తా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు పలుకుతూ వచ్చింది. మంగళవారం ఆరు వేలకు చేరగా, గురువారం రూ.8 వేలు పలికింది. శుక్రవారం మరో రూ.1500 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News April 24, 2025

మధుసూదన్ ఇంటికి రానున్న Dy.CM పవన్

image

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి Dy.CM పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కావలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

News April 24, 2025

మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం 

image

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.  

News April 24, 2025

నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

image

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!