News November 14, 2024
రెంజల్: కల్లు సీసాలో బల్లి కలకలం

కల్లు సీసాలో బల్లి కలకలం రేపిన ఘటన రెంజల్లో చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రంలోని ఓ కల్లు బట్టిలో ఓ వ్యక్తి కొన్న కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షమైంది. గమనించకుండా అతడు కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తోటి వారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.
Similar News
News October 22, 2025
నిజామాబాద్: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడ్ గ్రామంలోని క్యాంప్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలని, తూకం, మిల్లులకు తరలింపు సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
News October 21, 2025
NZB: కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలూర మండలం సాలెంపాడ్ క్యాంపుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
News October 21, 2025
18 మంది అసువులు బాశారు: NZB CP

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని CP సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు.