News April 13, 2025

రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత 

image

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 21, 2025

రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

image

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.

News November 21, 2025

మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతాలు చేస్తున్నారా?

image

విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మనోధైర్యం, ధృడ సంకల్పం, దుష్ట గ్రహాల ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమద్వ్రతం చేస్తారు. ☞ ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 21, 2025

జిల్లాలో భారీగా పంటల కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

image

పంటల కొనుగోలుపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు.