News April 13, 2025

రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత 

image

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 1, 2025

NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

image

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 1, 2025

GNT: ‘HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి’

image

గుంటూరు జిల్లాలో ప్రజలకు ఉచిత HIV పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సిలింగ్, పరీక్షా కేంద్రాలు (Standalone ICTCs), ప్రభుత్వ ఆసుపత్రులలో, 27 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో , 47 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో HIVతో జీవిస్తున్న వారికి NTR పెన్షన్ కింద రూ. 4,000 చొప్పున 2,634 మందికి అందిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి.

News December 1, 2025

కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

image

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.