News March 21, 2025

రెంటచింతల: ఊయల తాడు బిగుసుకొని బాలుడి మృతి

image

ఊయల తాడు బిగుసుకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన రెంటచింతలలోని ఆంజనేయస్వామి మాన్యంలో జరిగింది. సలిబిండ్ల అద్విక్ రెడ్డి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న ఊయలలో అతివేగంతో ఊగగా తాడు మెలికలు పడి బాలుడి గొంతుకు బిగుసుకొని చనిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Similar News

News December 10, 2025

జనవరి 25న కోనసీమలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం

image

కోనసీమ జిల్లా స్థాయి మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షులు కె.రాఘవ పిలుపునిచ్చారు. జనవరి 25న జరగనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ కృష్ణ మాదిగ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మాదిగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సభను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమ్మేళనం మాదిగ జాతి ఐక్యత, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

News December 10, 2025

18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే: గద్వాల కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ మ తదితర వాటిని చూయించి ఓటు వేయవచ్చని తెలిపారు.

News December 10, 2025

MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

image

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.