News March 21, 2025

రెంటచింతల: ఊయల తాడు బిగుసుకొని బాలుడి మృతి

image

ఊయల తాడు బిగుసుకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన రెంటచింతలలోని ఆంజనేయస్వామి మాన్యంలో జరిగింది. సలిబిండ్ల అద్విక్ రెడ్డి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న ఊయలలో అతివేగంతో ఊగగా తాడు మెలికలు పడి బాలుడి గొంతుకు బిగుసుకొని చనిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Similar News

News December 8, 2025

పాడేరు: టెన్త్ పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

image

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 9వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అల్లూరి DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. రూ.50 పెనాల్టీతో ఈనెల 12, రూ.200ల పెనాల్టీతో 15, రూ.500ల పెనాల్టీతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. అల్లూరి జిల్లాలో 244 విద్యాలయాల్లో 11,354మంది పదో తరగతి విద్యార్థులున్నారన్నారు. అందరూ పరీక్షలకు హాజరు అయ్యేలా టీచర్స్ కృషి చేయాలన్నారు.

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

కాజీపేటకు మరో రైల్వే ప్రాజెక్టు

image

KZPTలో ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా వ్యాగన్లు, రైలు ఇంజన్ల పిరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్‌ను కాజీపేటలో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. తొలుత MHBD తాళ్లపూసలపల్లిలో రూ.908 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదించినా, అక్కడి రేగడి నేల ఫౌండేషన్‌కు అనుకూలం కాదనే నివేదికతో ప్రాజెక్టును కాజీపేట సమీపానికి మార్చారు. 300 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.