News November 16, 2024
రెంటచింతల: కృష్ణా నదిలో దంపతులు గల్లంతు

కృష్ణానదిలో కార్తీక స్నానం చేయడానికి వెళ్లిన దంపతులు గల్లంతైన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తీక స్నానమాచరించడానికి సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడన్నారు. జాలర్లు పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
News November 19, 2025
గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
News November 19, 2025
GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.


