News November 16, 2024
రెంటచింతల: కృష్ణా నదిలో దంపతులు గల్లంతు

కృష్ణానదిలో కార్తీక స్నానం చేయడానికి వెళ్లిన దంపతులు గల్లంతైన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తీక స్నానమాచరించడానికి సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడన్నారు. జాలర్లు పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2026
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
సోలార్ దరఖాస్తుల్లో గుంటూరు జోరు!

పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్ల కోసం గుంటూరులో ఏకంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు ఈ యూనిట్లు ఉచితం. ఇతరులకు కేంద్రం రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. దరఖాస్తుల్లో 30 శాతం వరకు బీసీలవే ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 20 వేల సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీ మార్గదర్శకాల కోసం గుంటూరు లబ్ధిదారులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
News April 17, 2026
GNT: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

2027 పద్మ పురస్కారాలకు గానూ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎస్వో అఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగలవారు తమ పత్రాలను వర్డ్, పీడీఎఫ్ ఫార్మాట్లో మే 15లోపు sportsinap@gmail.comకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు awards.gov.in చూడొచ్చు. ఎంపిక చేసిన అర్హుల జాబితాను కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.


