News March 30, 2025

రెంటచింతల: ప్రేమ జంట ఆత్మహత్య 

image

ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్‌కతాలో శుక్రవారం చోటు చేసుకుంది. రెంటచింతల(మ) పాలువాయికి చెందిన రంగనాయక్(25)ఇంజినీరింగ్ పూర్తిచేసి కల్‌కతాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీలో జోవితతో సన్నిహితంగా ఉన్నాడు. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో జోవిత ఇక్కడే ఉండాలని కోరింది. దీంతో అతను ఆత్మహత్య చేసుకోగా, తట్టుకోలేని జోవిత కూడా ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News September 17, 2025

టెక్కలి: జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.

News September 17, 2025

వ్యవసాయ కూలీ టీచర్ ఉద్యోగానికి ఎంపిక

image

వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మెగా డీఎస్సీలో రేపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ 15వ ర్యాంకు సాధించారు. రేపల్లెకు చెందిన సొంటి సురేష్ స్కూల్ అసిస్టెంట్ (సామాజిక శాస్త్రం) విభాగంలో 80.56 మార్కులతో 15వ ర్యాంకు సాధించి 2 పోస్టులకు ఎంపికయ్యారు. సురేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తనకు క్రమశిక్షణ నేర్పిందన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

News September 17, 2025

ఖమ్మం: పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 22 నుంచి 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్ (టీఓఎస్‌ఎస్) పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.