News April 10, 2024
రెండింటిలోనూ చింతా మోహన్ హ్యాట్రిక్

కాంగ్రెస్ తిరుపతి MP అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గెలుపు, ఓటమిలో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 1984లో టీడీపీ అభ్యర్థిగా, 1989, 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1996లో పోటీ చేయలేదు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో గెలిచారు. 2014, 2019, 2021లో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నారు. 2021 ఉప ఎన్నికల్లో 9585 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 11వ సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
వివాదస్పదంగా కొందరు విలేకరుల తీరు.!

చిత్తూరు జిల్లాలో కొందరు <<18340244>>విలేకరులు దందాలకు<<>> పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇద్దరు విలేకరులు అగ్రికల్చరల్ మహిళా ఆఫీసర్ను బెదిరించగా కలెక్టర్ వారి అక్రిడిటేషన్ రద్దు చేశారు. తాజాగా GDనెల్లూరు సైతం ఇద్దరు విలేకరులు తనను బెదిరించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన విలేకరులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.
News November 20, 2025
క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.
News November 20, 2025
చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.


