News February 28, 2025

రెండు కార్పొరేట్ పాఠశాలలకు నోటీసులు

image

నర్సీపట్నంలో రెండు వివిధ కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈవో తలుపులు నోటీసులు జారీ చేశారు. బుధవారం శివరాత్రి, గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించి పాఠశాలలు తెరిచిన విషయం ఎంఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నోటీసులు జారీ చేశారు. విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Similar News

News November 13, 2025

జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

image

1.షేక్‌పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్‌నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్‌గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్‌రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)

News November 13, 2025

మేడారం.. రాజకీయ విమర్శలకు కేంద్రం..!

image

ఎవ్వరికి ఎవ్వరు తగ్గడం లేదు. దగ్గరలో ఎన్నికలేవీ లేకున్నా ములుగు జిల్లాలో రాజకీయం సలసల కాగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందుకు మేడారం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనదేవతల గద్దెల విస్తరణ, అభివృద్ధి పనులను నాసిరకం, నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత నాగజ్యోతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సీతక్క ‘చిల్లర విమర్శలు’ అంటూ నిన్న గట్టిగా తిప్పికొట్టారు.

News November 13, 2025

39పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 39 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(CBT), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/