News August 5, 2024

రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గోలేటి వాసి

image

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్ నగర్‌కి చెందిన రాజ్ కుమార్ ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాజ్ కుమార్ ఇరిగేషన్ AEEగా ఎంపికయ్యారు. ఇప్పటికే రాజ్ కుమార్ పోలీసు కానిస్టేబుల్ (సివిల్)గా 2020లో ఎంపికై ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్‌‌లో స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

Similar News

News October 13, 2025

ఆదిలాబాద్‌లో బంగారు ధర రికార్డు

image

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.

News October 13, 2025

ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణం

image

ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.

News October 12, 2025

ఆదిలాబాద్‌లో బడా రియాల్టర్లపై కేసు

image

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.