News February 7, 2025
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News October 31, 2025
జగిత్యాల: పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ లేదా కొత్త లీజు మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (SEIAA) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్సైట్లో (jagtial.telangana.gov.in) పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.
News October 31, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2011, కనిష్ఠ ధర ₹1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1820, కనిష్ఠ ధర ₹1775, వరి ధాన్యం (JSR) ధర ₹1950గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్ఫెడ్ ద్వారా నేడు మక్కల కొనుగోళ్లు జరగలేదని పేర్కొన్నారు.
News October 31, 2025
వాంకిడి: ‘నా కూతురు చావుకి కారుకులైన వారిని శిక్షించాలి’

తన కూతురు ప్రేమలత చావుకి కారకులైన వారిని శిక్షించాలని తండ్రి మేంఘజి కోరారు. ఈ మేరకు వాంకిడి ఎస్ఐ మహేందర్కి ఫిర్యాదు చేశాడు. ఖిరిడికి చెందిన ప్రేమలత(22)అదే గ్రామానికి చెందిన మహేశ్ను వివాహం చేసుకుంది.ఈనెల 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆమెను వర్ధా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందింది. అత్తింటి వారి వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.


