News June 2, 2024
రెండు వేల మందితో పటిష్ఠ భద్రత: ఎస్పీ కృష్ణకాంత్
జూన్ 4న రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News September 29, 2024
అక్టోబర్ 1న పత్తికొండకు సీఎం రాక: కలెక్టర్
అక్టోబర్ 1న పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 11.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 12.30 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని, అక్కడి నుంచి పుచ్చకాయలమడకు వస్తారని చెప్పారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో సంభాషిస్తారన్నారు.
News September 29, 2024
‘కర్నూలు విమానాశ్రయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’
కర్నూలు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విమానాశ్రయంలో మహిళా పోలీసులను కూడా నియమించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
News September 28, 2024
CM పర్యటన ఏర్పాట్లపై కర్నూలు కలెక్టర్ సమీక్ష
కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడలో అక్టోబర్ 1న CM చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో CM పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. CM పర్యటన ఏర్పాట్లపై శనివారం జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు.